పెద్దవడుగూరు మండలం కిష్టిపాడులో గురువారం రెవెన్యూ అధికారులు భూముల రీ సర్వే చేపట్టారు. సర్వే నంబర్ 319లో భూమి విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.