తాడిపత్రిలో బంగారు వ్యాపారిగా నమ్మించి ప్రజల నుంచి రూ. 8 కోట్లు వసూలు చేసిన ఆరిఫ్ పోలీసులకు చిక్కాడు. నెలకు రూ. 3 వేల వడ్డీ ఆశచూపి ప్రజల నుంచి నగదు, బంగారం సేకరించి, కొద్దిరోజులు వడ్డీ చెల్లించి, ఆపై పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కడప జిల్లా కొండాపురం వద్ద అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.