ఎల్లనూరు మండలంలో నటుడు విజయ్ దేవరకొండ నేడు పర్యటించనున్నారు. మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఆయన నటిస్తున్న 'రణబలి' సినిమా షూటింగ్ జంగంపల్లి కోట వద్ద జరగనుంది. చిత్ర యూనిట్ దీనికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పుట్లూరు సీఐ సత్యబాబు ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.