సోమవారం తాడిపత్రిలో, జేసీ అష్మిత్ రెడ్డి పట్టణంలోని శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం వద్ద 18 లక్షల రూపాయలతో జరుగుతున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు. పనుల నాణ్యతపై కాంట్రాక్టర్కు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, టీడీపీ కౌన్సిలర్లు, జేసీ అనుచరులు, అభిమానులు, 36వ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.