పెద్దవడుగూరు మండలంలోని ఫ్యాక్షన్ గ్రామం అప్పేచెర్ల గ్రామంలో పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఆంజనేయులు తన సిబ్బందితో కలిసి గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలుంటే ఘర్షణలకు పాల్పడకుండా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం పోలీస్ ఏఆర్ పికెట్ ను తనిఖీ చేసి, గ్రామంలో పల్లె నిద్ర చేపట్టారు.