తాడిపత్రి మండలం తేరన్నపల్లి వద్ద ఉన్న 220కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు తాడిపత్రి టౌన్, రూరల్, యాడికి మండలాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది. ట్రాన్స్కో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. విద్యుత్ సరఫరా అంతరాయం పట్ల ప్రజలు, వినియోగదారులు సహకరించాలని వారు కోరారు.