ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి రమాదేవి తాడిపత్రిలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలతో ఆమెకు ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పెద్దారెడ్డికి చెందిన రెండు స్కార్పియో వాహనాలు ధ్వంసం అయ్యాయని సమాచారం. ఈ సంఘటనతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.