అప్పుల బాధ భరించలేక పెద్దవడుగూరు మండలం ముప్పలగుత్తికి చెందిన రైతు రామాంజనేయులు ఆత్మహత్య చేసుకున్నారు. నాలుగేళ్లుగా పంటలు సరిగా పండకపోవడం, తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో మద్యానికి బానిసైన ఆయన, ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడుతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.