యాడికి మండల కేంద్రానికి చెందిన నందిని అనే యువతి, నవంబర్ 29న ఆత్మహత్యాయత్నం చేసుకుని కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.