తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి సోమవారం కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై ఇరువురూ చర్చించారు. పార్టీని మరింత బలోపేతం చేయడం, భవిష్యత్ కార్యాచరణ, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని శివరామిరెడ్డికి జగన్ సూచించారు.