విడపనకల్లు మండలం కేంద్రంలో బుధవారం నుంచి శనివారం వరకు కడ్లే గౌరమ్మ రథోత్సవ వేడుకలు జరుగుతాయని ఆలయ కమిటీ పెద్దలు సోమవారం తెలిపారు. రాష్ట్రంలోనే విడపనకల్లులో ప్రత్యేకంగా శెనగ పిండితో చేసిన గౌరీదేవి ప్రతిమకు మూడు రోజులు పూజలు నిర్వహిస్తారు. శనివారం ఉదయం అమ్మవారిని పూల రథంలో ఊరేగించి, స్థానిక గౌరమ్మ బావిలో నిమజ్జనం చేస్తారు. దీంతో ఉత్సవాలు ముగుస్తాయి.