ఉరవకొండ పట్టణ శివారులోని చాబాలకు వెళ్లే రహదారిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో పొలికి గ్రామానికి చెందిన ఫకృద్దీన్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108 ద్వారా ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పొలికి నుంచి ఉరవకొండకు వస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు.