బెళుగుప్ప మండలంలోని గుండ్లపల్లిలో మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ నిర్వహించిన ప్రజాదర్బారులో ప్రజల సమస్యలు వెల్లువెత్తాయి. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన మంత్రి, తన కుమార్తెకు పుట్టుకతో మూర్ఛవ్యాధి ఉందని, ఎన్టీఆర్ భరోసా పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని గుండ్లపల్లికి చెందిన వనిత చేసిన అభ్యర్థనకు స్పందిస్తూ, అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.