కూడేరు మండలంలోని చోళసముద్రం, కొర్రకోడు గ్రామాల మధ్య ఈ నెల 4వ తేదీన ఒక వర్గం వాహనంపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు 22 మందిని అరెస్ట్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, శుక్రవారం కూడేరు సమీపంలోని సాయిబాబా దేవాలయం వద్ద నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ రాజు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.