వజ్రకరూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆయూబ్ ఖాన్ అనే ఉపాధ్యాయుడు రాజస్థాన్లోని అజ్మీర్లో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగిన జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. 50 ఏళ్ల పురుషుల విభాగంలో 400 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం, 800 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం సాధించి రెండు పతకాలు గెలుచుకున్నాడు.