కాశినాయన మండలం నరసాపురం గ్రామంలోని పొలం దగ్గర పార్కింగ్ చేసిన బైకును గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించినట్లు బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై యోగేంద్ర తెలిపిన వివరాల ప్రకారం, సీసీ కెమెరాలో కనిపించిన అనుమానితుడి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. ఆ వ్యక్తి ఎవరికైనా కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.