వైఎస్సార్ కడప జిల్లా, బద్వేల్ నియోజకవర్గంలో బుధవారం జరిగిన క్రీడా పోటీల్లో బాక్సింగ్లో సగిలేరు గురుకుల
విద్యార్థులు ముగ్గురు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. పెద్ద ఓబయ్య, మహేష్ దివాకర్ లను మండల విద్యా శాఖ అధికారి జి. రాజశేఖర్ రెడ్డి, ప్రిన్సిపాల్ కె. సుబ్బయ్య, వైస్ ప్రిన్సిపాల్ కె. అశోక్, పీడీ కె. శ్రీకాంత్ రెడ్డి అభినందించారు. ఈ విజయం విద్యార్థుల క్రీడా నైపుణ్యానికి నిదర్శనం.