కడపలో 505 మొబైల్స్ రికవరీ

882చూసినవారు
కడపలో 505 మొబైల్స్ రికవరీ
కడప జిల్లాలో ఆపరేషన్ మోబీ ట్రాక్ 8వ విడతలో పోలీసులు రూ. 70 లక్షల విలువైన 505 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ బుధవారం బాధితులకు ఈ ఫోన్లను అందజేశారు. ఇప్పటివరకు మొత్తం రూ. 11. 76 కోట్ల విలువైన 5877 ఫోన్లను రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. CEIR, IMEI ట్రాకింగ్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఫోన్లను గుర్తించారు. ఫోన్ పోయిన వెంటనే సిమ్ బ్లాక్ చేసి, 1930 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్