బ్రహ్మంగారిమఠం మండలంలోని సోమిరెడ్డి పల్లె సచివాలయం-1 పరిధిలో చెత్త సేకరించే పంచాయతీ టాక్టర్కు బుధవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ప్రతిరోజూ చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్కు తరలించే ఈ వాహనం, ట్రాలీలో చెత్త నింపి ఉంచిన సమయంలో దగ్ధమైంది. ఈ ఘటనకు పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు.