ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ కలిసి ఆలయానికి చేరుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లాలోని ఒంటిమిట్టలో జరిగింది. ముఖ్యమంత్రి పర్యటనతో ఒంటిమిట్టలో సందడి నెలకొంది.