కడపలో పరిశుభ్రతపై కమిషనర్ కఠిన ఆదేశాలు

కడప నగరపాలక సంస్థ కమిషనర్ గురువారం నగరంలో పర్యటించారు. బుగ్గవంకలో ప్రజలు నేరుగా చెత్త వేయకుండా బ్రిడ్జిలపై ఫెన్సింగ్ పనులు తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని పబ్లిక్ టాయిలెట్లను తనిఖీ చేసి, వాటి నిర్వహణ, పరిశుభ్రతను పరిశీలించారు. టాయిలెట్లను నిత్యం శుభ్రంగా ఉంచాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
