మహిళలను అవమానించేలా తప్పుడు వార్తలు రాసిన ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, సురేష్ బాబు బుధవారం కడప వన్ టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. జర్నలిజం ముసుగులో జరుగుతున్న ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పందించాలని, మహిళలను కించపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకునే ధైర్యం ప్రభుత్వానికి ఉందా లేదా రాజకీయాల కోసం మౌనం వహిస్తారా అని నేతలు ప్రశ్నించారు.