కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి శనివారం జడ్పీ ఆవరణలోని అన్న క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార నాణ్యత, తాగునీరు, శుభ్రతను పరిశీలించిన ఆయన, పారిశుధ్య లోపాలను గమనించి అధికారులను మందలించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంతో పాటు, క్యాంటీన్లను నిరంతరం మరింత శుభ్రంగా నిర్వహించాలని ఆదేశించారు.