వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారిని శుక్రవారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.