కడప జిల్లా గ్రంథాలయాలను అభివృద్ధి చేసి పరిరక్షించుకుంటామని గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి భాను ప్రకాష్ తెలిపారు. శుక్రవారం కడప ఆఫీసర్స్ క్లబ్ లో జరిగిన సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ, 8 ఏళ్లుగా నిలిచిపోయిన జిల్లా కేంద్ర గ్రంథాలయ నిర్మాణాన్ని మంత్రి లోకేష్ సహకారంతో ఏడాదిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు సెల్ ఫోన్ లను పక్కన పెట్టి పఠనాసక్తి పెంచుకోవాలని ఎమ్మెల్సీ ఎం. వి. రామచంద్రారెడ్డి సూచించారు.