వైవీయూలో బుధవారం జరిగిన రిలయన్స్ ప్లేస్మెంట్ డ్రైవ్లో ఎంపికైన విద్యార్థుల జాబితాను త్వరలో ప్రకటిస్తామని ప్రతినిధులు తెలిపారు. ఎంబీఏ విభాగాధిపతి డా. పి. సరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంబీఏ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.