కడపలో శ్రీరామ శోభయాత్రలో మృతి చెందిన హరి కుటుంబానికి అయోధ్య ఆలయ కమిటీ తరఫున రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవి రెడ్డి శనివారం అందజేశారు. ఈ సాయంలో రూ. 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్గా, రూ. 5 లక్షలు నగదుగా అందించారు. హరి భార్యకు ఉద్యోగం, పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ, పాఠశాల యాజమాన్యాల మానవత్వాన్ని వారు ప్రశంసించారు.