వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, 'సూపర్ సిక్స్, సూపర్ సెవెన్' అంటూ 143 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమికి కౌంట్డౌన్ మొదలైందని అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, తిరుపతిలో జరిగిన సభ వారి అంతిమ వీడ్కోలును తలపించిందని, మహిళలు, రైతులు, యువతను ఈ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని ఆరోపించారు. డీఎస్సీ పేరుతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని, రెడ్బుక్ రాజ్యాంగంతో శాంతిభద్రతలను గాలికి వదిలేశారని విమర్శించారు.