కడప ఎమ్మెల్యే మాధవి శుక్రవారం తన క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ డివిజన్ల ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించగా, ఎమ్మెల్యే వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు తప్పక చేరువ చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.