కడప నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ రాకేష్ చంద్ర ఉక్కాయిపల్లిలోని ఎకో పార్కును సందర్శించి, అక్కడ పచ్చదనం, పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మొక్కల పెంపకం, నీటి వసతి కల్పించడం ద్వారా పార్కును మరింత సుందరంగా తీర్చిదిద్దాలని హార్టికల్చర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.