వైఎస్సార్ కడప జిల్లా కార్యాలయంలో బుధవారం ధర్నా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. జిల్లా అధ్యక్షులు బండి విశ్వనాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధర్నా కార్యక్రమాలు విజయవంతం కావడానికి ఆయన సూచనలు ఇచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మోపూరి వెంకట శివారెడ్డి కార్యకర్తలకు పిలుపునిస్తూ, ధర్నాకు భారీగా హాజరు కావాలని నాయకులను కోరారు. పలు రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొని మద్దతు తెలిపారు.