
పెండ్లిమర్రి: మెగా పేరెంట్స్ మీటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యే
పెండ్లిమర్రి మండలం గంగన్నపల్లి జెడ్పీ హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్లో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి పాల్గొన్నారు. ఆయన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం, పాఠశాల పరిసరాలను పరిశీలించి, ఉపాధ్యాయులతో పాఠశాల అభివృద్ధిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.






































