ఏబీఎన్ రాధాకృష్ణపై కమలాపురం పీఎస్లో వైసీపీ ఇన్చార్జ్ నరేన్ రామాంజులరెడ్డి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వల్లే మావిగాన్ తెరపైకి వచ్చిందని, అమరావతి రాష్ట్రానికి గుదిబండ అని విమర్శించారు. వైసీపీ కార్యకర్తల భార్యలపై అసభ్యంగా మాట్లాడిన రాధాకృష్ణకు మహిళలను కించపరిచే అర్హత లేదని నరేన్ రామాంజులరెడ్డి అన్నారు. అధికార మదంతోనే వ్యాఖ్యలు చేస్తున్నారని, శ్రేణులు ఐకమత్యంగా ఉండి వీటిని గట్టిగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.