ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి కడప విమానాశ్రయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణ చైతన్య రెడ్డి, మాధవి, జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెకు అభివాదం చేశారు.