కమలాపురం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పుల్లగూర శ్రీను, ఉపాధ్యక్షుడు మెరీన్ ప్రసాద్లు మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి కోగటం రైతులను మోసం చేశారని, దేవాలయ భూములను అనుభవించారని ఆరోపించారు. ఎమ్మెల్యే చైతన్యరెడ్డి పాపాగ్నికి నీరు తెచ్చి రైతులకు మేలు చేశారని తెలిపారు. సురేష్, వీరశివలు మతిభ్రమించి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.