మదనపల్లెలో 22న బాలిక ప్రసవించిన ఘటనపై డీఎస్పీ పావని విచారణ చేపట్టారు. గర్భానికి కారణమైన యువకుడి పేరు చెప్పడానికి బాలిక కుటుంబీకులు నిరాకరించారు. సీడబ్ల్యూసీ సూపర్వైజర్ ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు పట్టణానికి చెందిన జాహీద్(24)గా గుర్తించి, బెంగళూరు రోడ్డులోని చిప్పిలి వద్ద అతడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.