మదనపల్లె: చిప్పిలి గ్రామంలో పులి సంచారం?

478చూసినవారు
మదనపల్లె మండలం చిప్పిలి గ్రామ సమీపంలో పులి సంచరించినట్లు శనివారం కలకలం రేగింది. కృష్ణ కిషోర్ పొలంలో చిరుతపులి అడుగుల ముద్రలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎస్ఆర్డీ జయ ప్రసాద్ రావు ఆదేశాలతో అటవీ, రెవిన్యూ శాఖల అధికారులు చిప్పిలికి చేరుకుని పాదముద్రలను పరిశీలించారు. అవి చిరుతపులివేనా అనే విషయాన్ని నిర్ధారించాల్సి ఉందని, అప్పటివరకు గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్