మదనపల్లె సమీపంలోని కురబలకోట మండలం అంగళ్లు లో గురువారం
వైసీపీ యువ నాయకుడు అయ్యాజ్ తమ్ముడు హిజాజ్, నఫీసల వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మదనపల్లె మున్సిపల్ చైర్పర్సన్ మనుజ రెడ్డి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.