కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంటలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాలకు, 6, 7, 8 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వి. నిర్మల తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 4 నుంచి మార్చి 4 వరకు mjpapbcwreis.apcfss.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు పాఠశాలను సంప్రదించవచ్చు.