మంగళవారం దువ్వూరు మండలం సలవాసపల్లెలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్, ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లినిక్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ముత్యాల రాంగోవింద్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం స్థానికంగా చర్చనీయాంశమైంది.