మైదుకూరు శ్రీ బాలశివ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ భూమిరెడ్డి రవికళ్యాణ్ 'ఉగాది భారత గౌరవ రత్న-2026' జాతీయ అవార్డును హైదరాబాద్ రవీంద్రభారతిలో అందుకున్నారు. మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి, లక్ష్మీకాంతం, దర్శకుడు రేలంగి నరసింహారావు వంటి ప్రముఖులు ఆయనకు ఈ సత్కారం చేశారు. కళా, సామాజిక రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికి గాను ఈ అవార్డు లభించింది.