ప్రొద్దుటూరు విద్యుత్ శాఖ ఈఈ రమణారెడ్డి, ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా అందించే రూఫ్టాప్ సోలార్ విద్యుత్ పథకంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. మంగళవారం ప్రొద్దుటూరు విద్యుత్ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో, 6,697 యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా, ఈనెల 24వ తేదీ నాటికి 2,201 యూనిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.