పులివెందుల పట్టణంలోని స్థానిక జేఎన్టీయూ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ సహాయ అధ్యాపకురాలిగా పనిచేస్తున్న పగిడేల యమున డాక్టరేట్ పొందారు. అనంతపురం జేఎన్టీయూలో సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. విశాలి మార్గదర్శకత్వంలో ఆమె పరిశోధన చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ విష్ణువర్ధన్, అధ్యాపకులు యమునను అభినందించారు.