వైఎస్సార్ కడప జిల్లా, పులివెందులలో
జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పార్టీ నాయకులు కడప పార్లమెంట్ అబ్జర్వర్ శ్రీ చిలక మధుసూదన్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు. ఈ సందర్భంగా, రాయలసీమ ప్రోగ్రాం కమిటీ కో-కన్వీనర్ వెన్నపూస భరత్ రెడ్డి,
జనసేన నాయకులు డి.ఎస్.పీ. ప్రసాద్, ఫరూక్ లు పులివెందుల నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, సంస్థాగత నిర్మాణం, కమిటీల ఏర్పాటు, ప్రజా సమస్యలు, రాబోయే పార్టీ కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.