పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి శనివారం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ వివాదాలు, రైస్ కార్డ్స్, తాగునీటి సమస్యలు, రహదారులకు సంబంధించిన పలు వినతులను బాధితులు ఆయనకు అందజేశారు. ప్రతి ఒక్కరి సమస్యను సావధానంగా విని పరిష్కరించడమే తమ బాధ్యత అని బీటెక్ రవి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ఆయన అన్నారు.