వేంపల్లె మండలం అమ్మగారిపల్లెలో నెలకొన్న తీవ్ర నీటి సమస్యలపై గ్రామస్థులు మంగళవారం టీడీపీ ఇంఛార్జ్ రఘునాథరెడ్డికి వినతిపత్రం అందజేశారు. గ్రామస్థుల సమస్యలను సానుకూలంగా స్వీకరించిన రఘునాథరెడ్డి, నీటి విడుదలకు అవసరమైన చర్యలు రేపటి నుంచే చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సమస్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని వినతిలో పేర్కొన్నారు.