తమ పిల్లల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తల్లిదండ్రులకు సూచించారు. ఆదివారం పులివెందుల పట్టణంలోని స్థానిక ఎంపీపీ పాఠశాలలో ఆయన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి, చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ఆయన పిలుపునిచ్చారు.