సిద్ధవటం(M) లింగంపల్లె సమీపంలోని పెన్నానదిలో ఆదివారం ఈతకు వెళ్లిన యువకుడు మృతి చెందాడు. బాపట్ల జిల్లా చెరకుపల్లె మండలం గొల్లపల్లె గ్రామానికి చెందిన వంగర జగదీశ్ కుమార్(26) కడపలో బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఐదుగురు స్నేహితులతో కలిసి లింగంపల్లె శివారులోని పంప్ హౌస్ వద్ద ఈతకు వచ్చాడు. నదిలో దిగగా ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.