డిసెంబరు 5న జరగనున్న మెగా పేరెంట్ మీటింగ్కు పుల్లంపేట మండలం దలవాయిపల్లి ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మంగళవారం వినూత్న ఆహ్వాన పత్రికలను తయారు చేశారు. కలర్ పేపర్లతో ఫ్లవర్ బొకే ఆకారంలో రూపొందించిన ఈ ఆహ్వానాలను అందరూ ప్రశంసించారు. ఇలాంటి ఆలోచనలు విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలు పెంపొందిస్తాయని టీచర్ రమణ తెలిపారు.