కడప జిల్లా టి.సిండుపల్లి మండలం రాయవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఉపాధ్యాయులు వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. స్థానిక టీడీపీ నాయకులు అక్కడికి చేరుకుని వైద్యులతో మాట్లాడుతున్నారు.